Viral News: రాజస్థాన్ లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది.. తాగడానికి నీరు లేక ఐదు సంవత్సరాల బాలిక మరణించింది.. ఆమెతో ఉన్న వృద్ధురాలు స్పృహతప్పి పడిపోయింది.. ఈ విషయంపై కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ స్పందించారు..
రాయపూర్ నుంచి రాణి వాడ తాలూకాలోని రోడా గ్రామానికి సుఖీ దేవి భిల్ ఐదేళ్ల చిన్నారి తో బయలుదేరింది.. అసలే ఎండాకాలం. ఎండలు మండిపోతున్నాయి.. ఎండలో నడుచుకుంటూ వెళుతున్న వారికి తాగడానికి నీరు కూడా లేకపోవడంతో ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోయారు. దీంతో కొద్దిసేపటికే చిన్నారి ప్రాణాలు విడిచిపెట్టింది. స్థానికులు వెంటనే ఆ వృద్ధురాలికి నీటిని అందించి, సమాచారాన్ని సర్పంచ్ కృష్ణ రాజ్ పురోహిత్ కు అందించారు. సమాచారం అందుకున్న రాణి వాడా పోలీసులు కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే వైద్య సిబ్బందిని పిలిపించి వృద్ధురాలిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఐదేళ్ల చిన్నారి మరణంపై కేంద్రమంత్రి ప్రకాష్ జావడేకర్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీనియర్ నేత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పై విమర్శలు గుప్పించారు ప్రకాష్ జావడేకర్. ఈ సంఘటన ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం ఆయన మండిపడ్డారు.
9 घंटे तक पीने का पानी न मिलने के कारण हुई एक बच्ची की मृत्यु, बेहद शर्मनाक घटना है। इसके लिए राजस्थान सरकार ज़िम्मेदार है। सोनिया, राहुल, प्रियंका अब चुप क्यों हैं ?https://t.co/xl1pWyr8s5
— Prakash Javadekar (@PrakashJavdekar) June 8, 2021