Viral video: నైరుతి రుతు పవనాల కారణంగా మహారాష్ట్రలోని ముంబాయిలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ముంబాయి మహానగరంలో ఎక్కడ చూసినా వర్షపునీరు నిలిచిన దృశ్యాలు కనబడుతున్నాయి. చందివాలీలో రహదారులపై మురుగు నీరు ప్రవహిస్తుండటం ఆ ప్రాంత ఎమ్మెల్యేకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ సందర్భంగా అధికార శివసేన ఎమ్మెల్యే అయిన దిలీప్ లాండే ఆగ్రహంతో చేసిన పని విమర్శలకు దారి తీసింది.
డ్రైనేజీ కాల్వలకు చెత్త అడ్డంకిపడి నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయినట్లు గుర్తించిన ఎమ్మెల్యే దిలీప్ అందుకు కారణం డ్రైనేజీ పనుల కాంట్రాక్టర్ నిర్లక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు కాంట్రాక్టర్ ను అక్కడకు తీసుకువచ్చి మురుగునీటిలో కూర్చోబెట్టారు. అంతటితో ఆగకుండా అతనిపై మురుగు కాల్వలోని చెత్తను వేయాలంటూ పారిశుద్ధ్య కార్మికులను ఆదేశించాడు. ఎమ్మెల్యే చెప్పడంతో పారిశుద్ధ్య కార్మికులు ఆ కాంట్రాక్టర్ పై చెత్త వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్లపై నీరు నిల్వ ఉండటానికి ఆ కాంట్రాక్టరే కారణమని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్ లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మీరు చూడండి ఈ వీడియో..
Shiv Sena MLA Dilip Lande Humiliates Contractor; Makes Him Sit On Waterlogged Street, Asks Workers To Dump Garbage On Himpic.twitter.com/Dk3dqwktbs
— Megh Updates ? (@MeghUpdates) June 13, 2021