West Bengal Elections: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి , తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ నియోజకవర్గం నుండి విజయం సాధించారని వార్తలు వచ్చాయి. తన సమీప ప్రత్యర్థి, బీజెపిీ అభ్యర్థి సువేందు అధికారి పై 1,200 ఓట్ల మెజార్టీతో దీదీ విజయం సాధించారని వార్తలు షికారు చేశారు. ఇక్కడ రౌండ్ రౌండ్ కు తీవ్ర ఉత్కంఠతను రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా టీఎంసీ 215 స్థానాలకు పైగా ఆధిక్యత కొనసాగుతున్నా నందిగ్రామ్ నియోజకవర్గంలో మొదటి నుండి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి లీడ్ లో ఉండటంతో టీఎంసీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఈ నియోజకవర్గంలో ఫలితం చివరి వరకూ దోబూచులాండింది.
పార్టీ అధికారంలోకి వచ్చినా దీదీ పరాజయం పాలవ్వడం ఆ పార్టీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నారు. తొలి రౌండ్ నుండి బీజేపీ అభ్యర్థి సువేందు లీడ్ లో ఉండగా చివరి రౌండ్ లు వచ్చే మమత బెనర్జీ లీడ్ సాదించి 1,200 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే చివరలో బీజేపి అభ్యర్థి సువేందు విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ప్రజా తీర్పును గౌరవించినట్లు మమతా బెనర్జీ పేర్కొన్నారు. తాను పరాజయం పాలైనా పార్టీ ఘన విజయం సాధించిందన్నారు. ఇది బారత ప్రజల విజయమన్నారు. ఇదే సందర్భంలో ఈసీపై తీవ్ర విమర్శలు చేశారు దీదీ. కాగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నందిగ్రామ్ లో పెద్ద ఎత్తున కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.