BJP: హోరాహోరీగా జరిగిన బెంగాల్ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ చేసిన ప్రయత్నాలు తిప్పికొట్టి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ఈ రాష్ట్రంలో కృషి చేసినా టీఎంసీ గెలుపొందింది. అయితే, ఆమెకు వ్యక్తిగతంగా మాత్రం ఓటమి ఎదురైంది. ఈ ఓటమి విషయంలో మమత కీలక నిర్ణయం తీసుకున్నారు.
మమతకు బ్యాడ్ లక్…
మమతా బెనర్జీ ఇప్పటివరకు నందిగ్రాం నుంచి పోటీ చేస్తున్నారు. మమతకు నమ్మిన వ్యక్తిగా ఉంటూ వచ్చిన పార్టీ సీనియర్ నేత సువేందు అధికారి అదను చూసుకుని బీజేపీలో చేరిపోయారు. దీంతో ఆయనకు గుణపాఠం చెప్పాలన్న లక్ష్యంతో మమతా బెనర్జీ నందిగ్రాం నుంచి బరిలోకి దిగగా విజయం సాధించలేకపోయారు. అయితే, బెంగాల్లో టీఎంసీ గ్రాండ్ విక్టరీ కొట్టడంతో ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, నిబంధనల ప్రకారం 6 నెలల్లో అసెంబ్లీకి మమతా బెనర్జీ ఎన్నిక అవాల్సి ఉంది. దీంతో ఆమె ఎక్కడి నుంచి బరిలో దిగనున్నారనే చర్చ జరిగింది. తాజాగా దీనికి చెక్ పెట్టే నిర్ణయం తీసుకున్నారు.
అచ్చివచ్చిన చోటు నుంచే…
అచ్చివచ్చిన చోటు అయిన తన పాత నియోజకవర్గం కోల్కతాలోని భవానీపూర్ నుంచే మళ్లీ మమతా బెనర్జీ తాజా ఎన్నికల్లో బరిలో దిగనున్నారు. భవానీపూర్ నుంచి తాజా ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిగా పోటీచేసిన శోభన్దేబ్ చటోపాధ్యాయ గెలుపొందారు.
అయితే, ఆయన మమతా బెనర్జీ కోసం తన పదవికి రాజీనామా చేశారు. దీంతో మమతాబెనర్జీ మళ్లీ తన పాత నియోజకవర్గం నుంచే పోటీ చేయడం ఖాయమైంది. మరోవైపు మమతా బెనర్జీ కేబినెట్లో శోభన్దేబ్ చటోపాధ్యాయ.. వ్యవసాయ మంత్రిగా ఉన్నారు. తాజాగా తన పదవికి రాజీనామా చేసిన శోబన్ దేబ్ నిబంధనల ప్రకారం మరో ఆరునెలల్లోగా ఇంకా నియోజకవర్గం పోటీ చేసి గెలుపొందడం తప్పనిసరి.