- చైనీస్ లోన్ అప్స్ పై సోదాలు నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే రూపాయలు 17
కోట్లు స్వాధీనం చేసుకుంది - చైనీస్ లోన్ అప్స్ పెమెంట్స్ గేట్వేల ద్వారా ఇతర దేశాలకు డబ్బు బదిలీ చేస్తున్నట్టు ఆరోపణలు
- నకిలీ బ్యాంకు అకౌంట్స్ కూడా ఉన్నాయి అంటున్న ఈడీ అధికారులు
- ఇప్పటికే అనేక చైనీస్ లోన్ అప్స్ మీద లోన్ హరాసెమెంట్ కేసులు ఉండగా ఈడీ అధికారాల తనికీలు తాజా పరిణామం
చైనీస్ లోన్ అప్స్ పై ఒకేసారి హైదరాబాద్, ఢిల్లీ, బెంగుళూరు లాంటి ప్రముఖ నగరాలు కలుపుకొని మొత్తం 18 చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేయటం సంచలనంగా మారింది. చైనీస్ లోన్ అప్స్ పెమెంట్స్ గేట్వే కంపెనీల పై తనికీలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే రూపాయలు 17 కోట్లు స్వాధీనం చేసుకుంది.
ఎందుకు చైనీస్ లోన్ అప్స్ కంపెనీల పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తుంది?
మనీ లాండరింగ్ లేదా హవాలా
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముక్యంగా ఆరోపిస్తున్న అంశం నకిలీ బ్యాంకు అకౌంట్స్. ఈడీ ఆరోపణల ప్రకారం ప్రముఖ చైనీస్ పెట్టుబడులు ఉన్న పెమెంట్స్ గేట్వే కంపెనీలు నకిలీ బ్యాంకు అకౌంట్స్ ధ్వారా ఇతర దేశాలకు నగదు బదిలీ చేస్తున్నాయి. ఈ ఆరోపణల పై విచారణలో భాగంగా చైనీస్ లోన్ అప్స్ ఆఫీసుల పై ఈడి దూకుడు తో దాడులు నిర్వహించి మొత్తం రూపాయలు 17 కోట్లు స్వాధీనం చేసుకుంది.
పోస్ట్ రచయిత యొక్క వివరాలు:
Name: Deepak Rajula
MA in Mass Communication
(Print Journalism and New Media)
4+ Years of Experience