న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని 30 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో నలుగురు రైల్వే ఉద్యోగులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులు రైల్వే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు చెందిన ఉద్యోగులని పోలీసులు వెల్లడించారు. ఈ నెల 21వ తేదీ గురువారం అర్థరాత్రి 8-9 ఫ్లాట్ ఫాం వదద్ ఉన్న విద్యుత్ నిర్వహణ సిబ్బంది కోసం నిర్మించిన చిన్న రూమ్ లో మహిళపై సామూహిక అత్యాచారం జరిపారు. ఇద్దరు నిందితులు మహిళపై అత్యాచారం చేయగా, ఇద్దరు బయట కాపలాగా ఉన్నారు. నిందితులు సతీష్ కుమార్ (35), వినోద్ కుమార్ (38), మంగళ్ చంద్ (33), జగదీష్ చంద్ (37) లను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చారు.
రైల్వే డీసీపీ హరేంద్ర సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాలోని ఫరీదాబాద్ కుచెందిన మహిళ రెండేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయి ఉద్యోగం వెతుక్కుంటోంది. ఈ తరుణంలో తన స్నేహితురాలి ద్వారా నిందితుల్లో ఒకరైన సతీష్తో పరిచయచం ఏర్పాడింది. ఈ మహిళకు రైల్వే లో ఉద్యోగం ఇప్పిస్తానని సతీష్ ఆశచూపాడు. ఈ నేపథ్యంలోనే జులై 21న తన కుమారుడి పుట్టిన రోజు కు ఆమెను ఆహ్వానించాడు నిందితుడు సతీష్. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో కీర్తి నగర్ మెట్రో స్టేషన్లో సతీష్ను ఆ మహిళ కలుసుకుంది. అతను అమెను న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లోకి తీసుకువెళ్లాడు. అతను స్నేహితులు ముగ్గురుతో కలిసి ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. తర్వాత బెదిరంచి పంపినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. వారంతా మద్యం మత్తులో ఉన్నట్లు వివరించింది. బాధితురాలి ఫిర్యాదు పై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హజరుపర్చగా జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీసులు వివరించారు.