మహరాష్ట్ర చంద్రాపూర్ లోని బల్హర్షా జంక్షన్ రైల్వేస్టేషన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూలిన ఘటనలో గాయపడిన 48 ఏళ్ల ఓ మహిళ మృతి చెందినట్లు అధికారులు సోమవారం తెలిపారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు చెప్పారు. బల్హర్షా రైల్వే స్టేషన్ లో రెండు ఫ్లాట్ ఫారమ్ లను కలిపే పుట్ ఓవర్ బ్రిడ్జ్ ఆదివారం సాయంత్రం కూలిపోయింది. దీంతో వంతెనపై ప్రయాణిస్తున్న ప్రజలు రైలు పట్టాలపై పడిపోయారు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, మహిళ చికిత్స పొందుతూ మృతి చెందారు.
ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు సెంట్రల్ రైల్వే అధికారులు విచారణ ప్రారంభించారు. మరో పక్క తీవ్రంగా గాయపడిన వారికి లక్ష వంతున, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50వేల పరిహారాన్ని భారతీయ రైల్వే ప్రకటించింది. ప్రమాదం సమయంలో ఎక్కువ మంది ప్రయాణీకులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
సర్పంచ్ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో పరాజయం .. కానీ ఊహించని గిఫ్ట్ ఇచ్చిన గ్రామస్తులు.. అది ఏమిటంటే..?