Yashwant Sinha: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు. విపక్షాల మద్దతుతో యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉన్నారు. యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, జైరాం రమేష్, మల్లికార్జున్ ఖర్గే, ఎన్సీపీ నేత శరద్ పవార్, ప్రపుల్ పటేల్, ఎస్పీ నుండి అఖిలేష్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, డీఎంకే నుండి రాజా, టీఆర్ఎస్ నుండి మంత్రి కేటిఆర్, నామా నాగేశ్వరరావు, టీఎంసీ నుండి సౌగతో రాయ్, సీపిఎం నేత సీతారామ్ ఏచూరి తదితరులు పాల్గొన్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తొలుత రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్ధిని పోటీకి దింపాలని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ ప్రతిపాదించగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం కాంగ్రెస్ తో సహా ప్రాంతీయ పార్టీలు కలిసి యశ్వంత్ సిన్హా ను విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా ప్రకటించారు. యశ్వంత్ సిన్హాకు తెలంగాణ సీఎం కేసిఆర్ మద్దతు ఇస్తున్నట్లుగా ఆయన తనయుడు, మంత్రి కేటిఆర్ తెలిపారు. కాగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఈ నెల 24వ తేదీన నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.