Yass Tufan: బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాన్ యాస్ మరింత ఉగ్రరూపం దాల్చింది. అతి తీవ్ర తుఫానుగా మారి బాలసోర్ సమీపంలో తీరం దాటింది. తుఫాను వాయువ్య దిశగా కదులుతూ మూడు గంటల్లో బలహీనపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరాన్ని దాటే సమయంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ లోని తీర ప్రాంత జిల్లాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు హై అలర్ట్ ప్రకటించాయి. లోతట్ట ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను ధాటికి పలు చోట్ల ఇళ్లు, భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, టవర్లు నెలకొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు పడిపోవడం వల్ల కరెంటు సరఫరా నిలిచిపోయింది. గంటకు 130 నుండి 155 కి.మీ వేగంతో వీచిన పెనుగాలులకు ఒడిశాలోని భద్రక్ జిల్లాను అతలాకుతలం చేశాయి.
Read More: Etela Rajender: బీజేపీలో చేరిక అంశంపై ఈటెల క్లారిటీ ఇది..!!
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా చాందీపూర్ తీరంలో సుముద్రం బాగా ముందుకొచ్చింది. ఆ ప్రాంతంలోని సుమారు 30 గ్రామాలు సముద్రపు నీటిలో చిక్కుకున్నాయి. తుఫాను సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ రంగంలోకి దిగాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రెండు రాష్ట్రాల్లో దాదాపు 52 ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దాదాపు 20 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.