Yediyurappa: గత కొద్దికాలంగా వార్తల్లో నిలుస్తున్న కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సీఎం పీఠం విషయంలో కీలకవార్త తెరమీదకు వచ్చింది. ఇకపై కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప స్థానంలో బీజేపీ హైకమాండ్ మరో కొత్త వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించబోతున్నదన్న ఇటీవల జోరుగా సాగిన సంగతి తెలిసిందే. నేడు యడియూరప్ప తన పదవికి రాజీనామా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు కొద్ది సేపటి క్రితం చేసిన వ్యాఖ్యలు మాత్రం యెడ్డీ సీట్ సేప్ అన్న విశ్లేషణకు బలం చేకూరుస్తున్నాయి.
Read More : BJP: బీజేపీ ఆ విషయంలో కేసీఆర్ను వదిలిపెట్టట్లేదుగా!
నడ్డా ఏం చెప్తున్నారంటే..
రెండు రోజుల పర్యటన నిమిత్తం గోవాకు వెళ్లిన జేపీ నడ్డా… పర్యటన ముగించుకుని ఢిల్లీకి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కర్ణాటక సీఎం యడియూరప్పను మెచ్చుకున్నారు. కర్ణాటకలో ముఖ్యమంత్రిగా యడియూరప్ప పనితీరు చాలా బాగుందని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. యడియూరప్ప స్థానంలో కొత్త వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమిస్తున్నారటగదా అన్న మీడియా ప్రశ్నను ఆయన కొట్టిపారేశారు. కర్ణాటకలో నాయకత్వ సమస్య లేదని, అది మీ మీడియా ఫీలింగ్ మాత్రమేనని, మాకు మాత్రం అలాంటి ఫీలింగ్ లేదని ఆయన మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Read More : Modi: మోడీ లాగే కేసీఆర్ కూడా ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారు!
యడియూరప్ప ఏమన్నారంటే..
కాగా, పదవి నుంచి తప్పించడంపై కొందరు మీడియా ప్రతినిధులు ఈ విషయమై యడియూరప్పను ప్రశ్నించగా అందుకు యడియూరప్ప స్పందిస్తూ.. ఇప్పటివరకైతే ఎవరూ తనను రాజీనామా చేయమని అడగలేదని చెప్పారు. హైకమాండ్ నుంచి అలాంటి ఆదేశాలు ఏమైనా వస్తే.. పదవి నుంచి తప్పుకొని, పార్టీ కోసం పనిచేస్తానని ఆయన తెలిపారు. మీ వారసుడిగా మీరు ఎవరి పేరునైనా రికమెండ్ చేస్తారా..? అన్న ప్రశ్నకు తాను ఎవరి పేరునూ రికమెండ్ చేయబోనన్నారు. పార్టీ అధిష్ఠానమైతే ఇంతవరకు ఏమీ చెప్పలేని, జూలై 26 తర్వాత ఏం జరుగనుందో వేచి చూద్దామని యెడ్డీ వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే.. వీరశైవ, లింగాయత్లకు చెందిన వివిధ మఠాల అధిపతులు యెడ్డీకి మద్దతు పలుకుతున్నారని, అందుకే బీజేపీ హైకమాండ్ యెడ్డీని సీఎం పదవి నుంచి తప్పించాలని భావిస్తున్నా.. ఆ విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నదని కర్ణాటకలో రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.