రెండు రోజుల క్రితం జరిగిన మైనర్ బాలిక హత్య ఘటన మరువక ముందే ఢిల్లీలో మోర యువతి దారుణ హత్యకు గురైంది, ఇంటి టెర్రస్ పై రక్తపు మడుగులో ఉన్న ఓ యువతి మృతదేహాన్ని ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడైనా యువతి హత్య జరిగింది అంటే అతని బాయ్ ప్రెండో, లేక రిలేషన్ చెడిన వాడో చేసి ఉంటాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఈ యువతిని హత్య చేసింది కూడా మరో యువతే. అదీ కూడా ఆమెతో కలిసి ఉండే యువతే కావడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. నార్త్ ఢిల్లీలోని మంజుకా టిల్లా ఆపార్ట్ మెంట్ లో రాణి (35), సప్నా అనే ఇద్దరు యువతులు ఉంటున్నారు. రాణి గురగ్రామంలో బ్యూటీ పార్లర్ లో పని చేస్తుండగా, సప్నా భర్తతో విడాకులు తీసుకుని కూతురితో కలిసి రాణితో ఉంటోంది. సప్నా పెళ్లి వేడుకల్లో వెయిటర్ గా పని చేస్తుంటుంది. కాగా ఒక పార్టీలో సప్నా బాగా మద్యం సేవించి రాణిని ఇష్టం వచ్చినట్లుగా దుర్భాషలాడింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది.
అనంతరం వేరువేరుగా ఇద్దరు తమ ప్లాట్ లోకి వచ్చారు. మంగళవారం ఉదయం మరో సారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో సప్నా కత్తితో దాడి చేసి రాణిని ఇష్టం వచ్చినట్లు పొడిచి హత్య చేసింది. అనంతరం ఆమె పోలీసులకు లొంగిపోయింది. ఢిల్లీ నార్త్ డీసీపీ సాగర్ ఖాస్లీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు. రాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.