కివీ పండు సాధారణ పండు కాదు. ఏ పండ్లలో లేనన్ని పోషకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. కివీ పండుతో రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది. ఈ పండు పలు అనారోగ్యాలకు కూడా సూపర్ మెడిసిన్గా పనిచేస్తుంది కణాలను నాశనం చేసే విష వ్యర్థాలను కివీ పండ్లు అంతం చేసి… రక్తంలో ఆక్సిజన్ సప్లై పెరిగేలా చేయగలవు.కాస్త రేటు ఎక్కువైనా కూడా రోజుకు 2 పండ్లు తింటే మంచిది.
పప్పులు, గింజలు, బద్దలు ఇవన్నీ లెగ్యూమ్ జాతి గా చెప్పబడతాయి . వీటిలో లెఘ మో గ్లోబిన్ ఉండి ఇది ఆక్సిజన్ను మోసుకెళ్తుంది. కాబట్టి ఈ గింజలు ఆహారం లో తినడం మొదలు పెట్టి ఆక్సిజన్ సమస్య తగ్గించుకోండి.పైనాపిల్ , ద్రాక్ష పండ్లు, కిస్మిస్, పియర్స్, ఇవితిన్నాకూడా ఆక్సిజన్ బాగా అందుతుంది. ముఖ్యంగా పైనాపిల్ చాలా బాగా పనిచేస్తుంది. వీటిని వీలైనంతగా ఆహారం లో ఎక్కువగా తింటూ ఉండడం వలన శరీరం ఆక్సిజన్ను బాగా పొందుతుంది.అయితేపైన్ఆపిల్ గర్భిణీలపై చెడు ప్రభావం చూపుతుంది. ఇది గర్భసంచి ముడుచుకు పోయేలా చేస్తుంది కాబట్టి.. గర్భంతో ఉన్న స్త్రీలు ఈ పండును తినకపోవడమే మంచిది .
ఆక్సిజన్ శరీరానికి బాగా అందాలంటే ఐరన్ బాగా ఉండాలి అని గుర్తు పెట్టుకోండి. కాబట్టి ఐరన్ ఉండే ఆహారం ఎక్కువగా తినాలి. సముద్ర ఆహారం, మాంసం లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.అయితే శాఖాహారులు వీటిని తినడానికి ఇష్టపడరు. కాబట్టి పైన మనం చెప్పుకున్న ఆహారం తినవచ్చు.మాంసాహారం తీసుకునేవారు మాంసాహారం తో పాటు పయిన చెప్పిన అన్ని తినవచ్చు. ఇంకా స్వీట్ పొటాటోస్ ఆవకాడో , రెడ్ బెర్రీస్, బ్లూ బెర్రీస్, కూడా ఆక్సిజన్ను పెంచడం లో బాగా పనిచేస్తాయి. కాబట్టి ఎవరికీ అందుబాటులో ఉన్నవి వాళ్ళు తీసుకోవడం వలన మంచి ప్రయోజనం ఉంటుది.
పార్ట్-1 కోసం ఈ లింకుని క్లిక్ చెయ్యండి