మెల్ బోర్న్ టెస్ట్ లో నాలుగో రోజు టీ విరామ సమయానికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. నాలుగు టెస్టుల సిరీస్ లో ఇప్పటి వరకూ ఇరు జట్టూ1-1తో సమానంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ టెస్టులో విజయం సాధించి ఆధిక్యతను 2-1కి పెంచుకోవాలన్న భారత్ ఆకాంక్షకు వరుణుడు అడ్డంకిగా మారే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటి వరకూ మాత్రం విజయావకాశాలు భారత్ కే మెండుగా ఉన్నాయి. ఆసీస్ కు 399 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్ ఇప్పటికే ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లను పడగొట్టింది. బూమ్రా మూడు వికెట్లు తీసుకున్నాడు. విజయం సాధించాలంటే ఆస్ట్రేలియా ఇంకా 261 పరుగులు చేయాలి. చేతిలో ఐదు వికెట్లు ఉన్నాయి.
previous post
next post