ఢిల్లీ, జనవరి 19: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయూర్తిగా జస్టిస్ దినేశ్ మహేశ్వరిలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
వీరి పదోన్నతులకు సంబందించి ఈ నెల పదవ తేదీన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలో కొలిజియం సిఫార్సు చేసిన విషయం విదితమే.
వీరి పదోన్నతులపైనే ఢిల్లీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి కైలాష్ గంభీర్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కు లేఖ రాసారు.