హైదరాబాదు, మర్చి 4: మాదాపూర్లోని ఐటి గ్రిడ్ సాఫ్ట్వేర్ సంస్థ ఎపి ప్రజల వ్యక్తిగత సమాచారం భద్రపరిచినట్లు గుర్తించామని హైదరాబాదు సిటి పోలిస్ కమిషనర్ సిపి సజ్జనార్ తెలిపారు. సోమవారం ఆయన మిడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులను రెండు రోజుల పాటు ప్రశ్నించామని సజ్జనార్ తెలిపారు. ఐటి గ్రిడ్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి ల్యాప్టాప్, హార్డ్డిస్క్లు, పత్రాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వాటిని ఫారెన్సిక్ ల్యాబ్కు పంపుతామని తెలిపారు.
వీరి వద్ద ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నియోజకవర్గాల వారిగా ఓటర్ల జాబితా, వివిధ పథకాల లబ్దిదారుల డేటా, కులం, ఏ పార్టీకి చెందిన వారు తదితర వ్యక్తిగత విషయాలు ఉండటాన్ని గుర్తించామని సిపి వెల్లడించారు.
ఈ సంస్థ టిడిపి యాప్ సేవా మిత్రకు కూడా పని చేస్తున్నదని చెప్పారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో చాలా మంది తమ ఓట్లు గల్లంతు అయ్యాయంటూ ఫిర్యాదులు చేశారని చెప్పారు. ఈ ఐటి గ్రిడ్ సంస్థకు చెందిన ముఖ్యమైన వ్యక్తి అశోక్కు నోటీసులు జారీ చేశామనీ, ఇంత వరకూ అతను హజరుకాలేదని సిపి చెప్పారు. ఆయన వెంటనే వచ్చి సరెండర్ కావాలని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుందని సిపి సజ్జనార్ తెలిపారు.