తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెప్తారు. ఎందుకో తెలుసుకుందాం…. ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది.
గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలం.. కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈరోజున దేవాలయాల్లోనూ.. ఇళ్ల వద్దా పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు. అలాగే పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి.. అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈ రోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత.
ఏది ఏమైనా పెద్దలు పెట్టిన ఆహార నియమాలలో అనేక శాస్త్ర విషయాలు ఉన్నాయి. వాటి గురించి పరిశోధిస్తే అనేక రహస్యాలు తెలుస్తాయినడంలో అతిశయోక్తి లేదు.