మిజో నేషనల్ ఫ్రంట్ అధినేత జొరామ్థంగా మిజోరం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా జరిగిన మిజోరం అసెంబ్లీ ఎన్నికలలో మిజో నేషనల్ ఫ్రంట్ పూర్తి మెజారిటీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. జొరామ్థంగా మిజో భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో మిజో నేషనల్ ఫ్రంట్ పదేళ్ల తరువాత అధికారంలోనికి వచ్చింది. 40 స్థానాలు ఉన్న మిజోరం అసెంబ్లీలో మిజో నేషనల్ ఫ్రంట్ 26 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు స్థానాలకు పరిమితమైంది.
previous post
next post