ఉత్తరప్రదేశ్, జనవరి 14: ప్రయాగ్ రాజ్ లో మంగళవారం నుండి ప్రారంభం కానున్న అర్ధ కుంభమేళా జరిగే ప్రదేశంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం గిగంబర్ అకాడ శిబిరంలో వంట గ్యాస్ సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి.
అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ఎగసి పడుతున్న మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదం కారణంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డేరాలు కొన్ని కూలిపోయాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.
ఈ మేళా మకర సంక్రమణం నుండి మార్చి నాలుగున మహాశివ రాత్రి పర్వదినం వరకు జరుగుతుంది.
previous post