ప్రస్తుతం ఉన్న జీవన విధానం లో మారిన ఆహార అలవాట్ల కారణంగా చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో డాక్టర్లు ప్రతి రోజూ ఉదయం పరగడుపునే ఈ టాబ్లెట్ వేసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది అంటూ ఓ టాబ్లెట్ ఇస్తున్నారు. కడుపులో మంట అని చెప్పగానే మందుల షాపు వాళ్లు కూడా ఆ టాబ్లెట్ చేతిలో పెడతారు. అయితే ఇప్పుడు ఆ టాబ్లెట్ రోజూ వాడే వాళ్లకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్య పరిశోధకులు తెలియచేస్తున్నారు.
ఆ టాబ్లెట్ రాన్టాక్ అని మీకు కూడా తెలిసే ఉంటుంది… మనం తినే ఆహారం జీర్ణమై పొట్టలో గ్యాస్ట్రిక్ యాసిడ్ విడుదల కాకుండాఅడ్డుకోవడానికి ఉపయోగించే ఈ రాన్టాక్ టాబ్లెట్లో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నట్లు ఓ పరిశోధనలో కనుగున్నారు . తాజాగా అమెరికాకు చెందిన ఎఫ్.డీ.ఏ.వారు ఈ రాన్టాక్ టాబ్లెట్లో ‘నైట్రోసోడైమిథైలమైన్’ అని పిలవబడే క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ టాబ్లెట్లో NDMA ఉండాల్సిన మోతాదు కంటే అధికం గా ఉందంట…అలాగే దీని తయారీలో లోపం ఏర్పడడం వల్ల ఈ కలుషిత మిశ్రమం క్యాన్సర్ కుకారణమవుతుంది అని డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులుతెలియచేస్తున్నారు. ప్రస్తుతం ఈ రాన్టాక్ టాబ్లెట్ వాడకం కొన్ని దేశాలు నిషేధం లో నిషేధించబడ్డాయి.
అయితే ఇప్పటికే శాండూజ్ ఫార్మా కంపెనీ ఈ రాంటాక్ టాబ్లెట్ లు వెనక్కి తీసుకుని నాశనం చేశారు. అయినా ఇంకా మన దేశంతో సహా కొన్ని దేశాల్లో ఇవి చెలామణిలో ఉన్నాయి. ఈ రాన్టాక్ టాబ్లెట్ వాడే బదులుగా మార్కెట్లో గ్యాస్ట్రిక్ యాసిడ్ తగ్గే మరెన్నో మందులు అందుబాటులో ఉండగా వాటిని వాడితే మంచిదని ఎఫ్డీఎ తెలియచేస్తుంది . ఇక మీదట గ్యాస్ట్రిక్ కోసం మీరు మెడికల్ షాపులకు వెళితే రాన్టాక్ టాబ్లెట్ మాత్రం అసలు తీసుకోకండి. దానికి బదులుగా వేరే టాబ్లెట్ తీసుకోవడం మంచిది.