మిగతా మాంసాహారానికి కన్నా చేప తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు తెలియచేస్తున్నారు. వారానికి ఒక్కసారి మాత్రమే తినేవారితో పోలిస్తే మూడు సార్లు తినే వారిలో పేగు క్యాన్సర్ ముప్పు 12% తక్కువగా ఉంటుంది అని పరిశోధనలో బయటపడింది.కాబట్టి వారానికి మూడు సార్లు తినేందుకు ప్రయత్నం చేయండి..పేగు క్యాన్సర్ ప్రమాదం రాకుండా ఉండాలంటే తప్పకుండా చేపలు తినాలని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. ఆరోగ్యకర ఆహారం గా చెప్పడం లో చేప ది పెద్ద పాత్ర అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు .
చేపలలో ఉండే కొవ్వు ఆమ్లాలు శరీరంలో వాపులుతగ్గేలా చేస్తాయి అని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ పరిశోధకులు తెలుసుకున్నారు . శరీరంలో వాపు ప్రక్రియ డీఎన్ఎ ను నాశనం చేస్తుంది. దీంతో క్యాన్సర్ కు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది
ఆడవారిలో నెలసరి సమస్యలు రాకుండా ఉండాలన్న ఆ సమయంలో ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే తరచూ చేపలు తినాలని డాక్టర్ తెలియచేస్తున్నారు .వీటితో పాటుగా ఆహారం లో ఎక్కువగా కేవలం మాక్రెల్, షెల్ ఫిష్, సాల్మన్, సార్డినెస్చేపలు తీసుకోవడం వల్ల పురుషుల్లో శృంగార కోరికలు బాగా పెరుగుతాయి. ముఖ్యంగా..పురుషులు సమర్థ వంతం గా శృంగారం చేయాలంటే వారికీ ఒమేగా 3, ఒమేగా 6 అవసరం చాలానే ఉంది . దీనికి చేపలే మంచి ఔషధం గా చెప్పబడుతున్నాయి . ఇంకా చెప్పాలంటే దీనికి మించిన మందు ప్రకృతిలో ఇంకొకటి లేదనే చెప్పాలి.
పిల్లల ఆహారం లో ఎక్కువగా చేపలు ఇస్తే వారిలో బుద్ధిబలం బాగా పెరుగుతుంది అనినిపుణులు తెలియచేస్తున్నారు. దీంతోబాటు వారి శరీరంలో కొవ్వు శాతం కూడా తగ్గినట్లు, ఇతర శరీర భాగాలు కూడా సక్రమంగా ఎదిగినట్లు పరిశోధనలో తేలింది అని వారు వివరించారు. అయితే ఎప్పుడు ఒకే రకమైన చేపలు తినడం కంటే మార్చి మార్చి తినడం వలన మరింత ప్రయోజనం కలుగుతుంది అని మాత్రం మరువకండి.