నంద్యాల : జనసేన ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో జనసేన అధినేత పవన్కల్యాణ్ పాల్గొన్న బహిరంగ సభలో శుక్రవారం తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో సిరాజ్ (30) అనే యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..’ ఈ సభకు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. సభ కోసం స్పీకర్లకు ఏర్పాటు చేసిన ఇనుప కడ్డీలు జారిపోవడంతో ఒకరిమీద ఒకరు పడిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సిరాజ్ను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ యువకుడు మృతి చెందాడు’.
సిరాజ్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.