హైదరాబాద్ : భానుడి ప్రతాపానికి ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ‘చల్లని’ కబురు అందించింది. జూన్ 1న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని తెలిపింది. వాతావరణం అనుకూలిస్తే జూన్ 6, 7 తేదీలకల్లా రాయలసీమకు నైరుతి రైతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని ప్రకటించింది. అలాగే రాగల 72 గంటల్లో విదర్భ నుంచి తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితలద్రోణికొనసాగుతోంద ని తెలిపింది. బలమైన గాలులు, ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
మరోవైపు ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాల్లో ఈ నెల 31న అల్పపీడనం ఏర్పడవచ్చునని తెలిపింది. బంగాళాఖాతంలో తుఫాను సంచారంతో వేగం పుంజుకున్నాయని తెలిపింది.