ఢిల్లీ, జనవరి19: రాష్ట్ర పోలీసు డిజీపీల నియామకం పై సుప్రీం సంచలన వ్యాఖ్యలు చేసింది. డిజిపిల నియామకానికి సంబందించి పలు రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్ లపై సుప్రీం ఈ వ్యాఖ్యలను చేసింది.
రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ ను యూపీపీఎస్ సి ద్వారా కాకుండా తాము సొంతంగా కమిటీ ద్వారా నియమించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కొన్ని రాష్ట్రలు కోరగా సుప్రీం కోర్టు తిరస్కరించింది.
ఈ రాష్ట్రాల పిటిషన్లను బుధవారం తోసిపుచ్చింది.
డీజీపీలను రాష్ట్రాలు తమ సొంత చట్టాల ద్వారా నియమించుకునేందుకు అవకాశం లేదని స్పష్టం చేసింది.
పోలీసు శాఖ రాష్ట్రానికి సంబంధించిన అంశమని, కాబట్టి దీని అధిపతిని తామే నియమించుకుంటామని ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాలు కోరాయి.
ప్రస్తుత కేసులో ధర్మాసనానికి నేతృత్వం వహించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ మాట్లాడుతూ. . డీజీపీల ఎంపికపై సుప్రీం కోర్టు గతంలోనే ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు.
డీజీపీల ఎంపిక విస్తృత ప్రజా ప్రయోజనాలు ఇమిడి ఉన్న అంశమని,రాజకీయ జోక్యం నుంచి పోలీసు శాఖను రక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు.