తెలుగు చలనచిత్ర రంగంలో టాప్ మోస్ట్ నిర్మాణ సంస్థలలో వైజయంతి మూవీస్ ఒకటి. ఈ బ్యానర్ లో చాలా పేరుగాంచిన సినిమాలు వచ్చాయి. ఈ సంస్థ అధినేత అశ్వినీ దత్. ఈ క్రమంలో ప్రస్తుతం 50వ సినిమా ఈ బ్యానర్ లో తేరకెక్కుతోంది. ప్రభాస్ హీరోగా మహానటి ఫ్రేమ్ డైరెక్టర్ నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టు కే అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బడా నటీనటులు నటిస్తున్నారు. అమితాబచ్చన్, దీపికా పదుకొనే… ఇంకా పలువురు కీలకమైన పాత్రలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టు కే గురించి నిర్మాత అశ్విని దత్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
హాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయిన “అవెంజర్స్” మాదిరిగా “ప్రాజెక్టుకే” ఉంటుందని స్పష్టం చేశారు. “అవెంజర్స్” సినిమా హాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. అటువంటి సినిమాతో అశ్వినీ దత్… ప్రభాస్ సినిమాని పోల్చడంతో.. “ప్రాజెక్టు కే” పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ కోసం.. హాలీవుడ్ ఇండస్ట్రీ నుండి హై టెక్నాలజీ కెమెరాలు అద్దెకు తీసుకోవడం జరిగిందంట.
ఆ హై క్వాలిటీ కెమెరాలకి అద్దె దాదాపు కొన్ని కోట్లు ఖరీదు చేస్తున్నట్లు.. సినిమా నిర్మాత ఖర్చుపెడుతున్నట్లు టాక్. “బాహుబలి 2” తర్వాత ప్రభాస్ నటించిన “సాహో”, “రాదేశ్యం” రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ప్రాజెక్టుకే, సలార్, ఆది పురుష్ సినిమాలపై అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ఈ మూడింటిలో ఆది పురుష్ మొదట విడుదల కానుండగా రెండోది “సలార్”… ఆ తర్వాత “ప్రాజెక్టు కే” విడుదల కానుంది.