ఈ రోజుల్లో ఇంచుమించుగా అందరూ చికెన్ ని చాలా ఇష్టపడుతున్నారు. కాబట్టి ఒకసారి చికెన్ కి సంబంధించిన కొన్ని విషయాలు కూడా తెలుసుకుంటే మంచిది. మనం చాలా వరకు బ్రాయిలర్ చికెన్ నే వాడుతూ ఉంటాము. ఆ కోళ్లను దాణా బాగా పెట్టి పోషిస్తూ ఉంటారు . అందుకే కోళ్లు ఎక్కువ బరువు పెరుగుతాయి. అయితే దాణామాత్రమే కాకుండా దానితో పాటు కోళ్లకు యాంటీ బయోటిక్ ఇంజెక్షన్లనుఇస్తుంటారు. ఈ ఇంజక్షన్ వలన కోళ్లు రోగాలకు తట్టుకుని మరింత బాగాపెరుగుతాయి. అయితే ఇలా పెంచడం వలన కోళ్లకు మంచిది కానీ మనకు మాత్రం కాదు.
ఈ కోళ్లను తినడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు వస్తాయట .మనకు ఇన్ఫెక్షన్లు వస్తున్నాయట. అలాగే ఆ ఇన్ఫెక్షన్లను తట్టుకోవడానికి యాంటీ బయోటిక్ మందులను మనకు ఇచ్చినా ఫలితం ఏమాత్రం ఉండడం లేదట. ఈ క్రమంలో మన శరీరం లో బాక్టీరియా, వైరస్లు కూడా మనం వాడే యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ మందులకు తట్టుకుని రోజు రోజుకీ మరింత బలం గా తయారవుతున్నాయట. అలాగే యాంటీ బయోటిక్ మందులను వాడుతూ పెంచిన కోళ్లను తినడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చి మన దేశంలో సంవత్సరానికి, 7 లక్షల మంది పెద్దలు,1 లక్ష మంది చిన్నారులు చనిపోతున్నారని ఇటీవలే ది హిందూ, ది బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనే సంస్థలు చేసిన పరిశోధనలోబయట పడింది.
మన దేశంలో ఫాంలలో పెంచే కోళ్లకు ఇచ్చే యాంటీ బయోటిక్ మందు లు జొయెటిస్ అనే కంపెనీ అద్వర్యం లోతయారు చేయబడుతున్నాయి. ఇక్కడ గమనించవలిసిన విష్యం ఏమిటంటే, ఈ కంపెనీ తయారు చేసే ప్రోడక్ట్ ల ను అమెరికా, యూరప్ దేశాలలో లలో ఎప్పుడో నిషేధించారు.