ముంబై ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది సజీవదహనం అయ్యారు. దాదాపు 145 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించగలిగారు. మృతులలో అత్యధికులు పేషంట్లే. మరోల్ లోని ప్రభుత్వ ఈఎస్ఐ ఆసుపత్రిలో సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మరణఇంచడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఆసుపత్రిలో మంటలను అదుపు చేయడానికి సిబ్బందికి మూడు గంటలకు పైగా సమయం పట్టింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదకారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.