ముంబై – అహ్మదాబాద్ మధ్య ప్రవేశపెట్టనున్న బుల్లెట్ ట్రైన్ వల్ల భూములు కోల్పోయే రైతులతో జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేటివ్ ఏజెన్సీ రేపు భేటీ కానుంది. కత్సో మత్సుమోటో నేతృత్వంలోని జికా ప్రతినిథుల బృందం భూములు కోల్పోనున్న రైతులతో భేటీ అవుతుంది. సూరత్ లో ఈ భేటీ జరుగుతుంది. ముంబై- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును జపాన్ ప్రభుత్వం జికా ద్వారా చేపట్టిన సంగతి తెలిసిందే. భూమి కోల్పోయే రైతుల తరఫున పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది కూడా రేపటి భేటీలో పాల్గొంటారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?