రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ కొద్ది సేపటి కిందట ప్రమాణ స్వీకారం చేశారు. మరో సీనియర్ నేత సచిన్ పైలట్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరరాజె, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ఇంకా పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఛత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం కూడా ఈ రోజు జరగనున్న సంగతి తెలిసిందే.