విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్కు లేఖ రాశారు.
రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారని చంద్రబాబు గోయల్కు లేఖలో వివరించారు. విశాఖ జోన్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వాల్తేర్, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో జోన్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
గత శనివారం ఇదే అంశంపై ఏపి బిజెపి నేతలు గోయల్తో భేటీ అయ్యారు.
విభజన చట్టంలో ప్రస్తావించిన రైల్వే జోన్ ఏర్పాటు హామీ ఇప్పటి వరకూ నెరవేర్చకపోవటంపై నేతలు గోయల్తో చర్చించారు. రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై కూడా చర్చించారు.
రైల్వే జోన్ అంశంపై గోయల్ సానుకూలంగా స్పందించారని నేతలు సమావేశ అనంతరం మీడియాకి తెలిపారు. మార్చి 1న ప్రధాన మంత్రి విశాఖకు వస్తున్నందున ఆ సభలో కానీ, అంతకంటే ముందే కానీ విశాఖ రైల్వే జోన్ ప్రకటిస్తారని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.