విజయవాడ, డిసెంబర్ 25: ముస్లిం సమస్యలను సుప్రీంకోర్టు వరకు తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ఏపీ ముస్లిం పర్సనల్ లా బోర్డు ఛైర్మెన్ హజరత్ అల్తాఫ్ అలీ రజా పేర్కొన్నారు. మంగళవారం కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుఖారీ మసీదు ప్రాంగణంలో ముస్లిం పర్సనల్ లా బొర్డు ఆఫ్ ఇండియా మొదటి సమవేశం నిర్విహించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ తాను స్వచ్ఛందంగా ముస్లిం సమాజానికి చేస్తున్న నిస్వార్ధ సేవలకు గుర్తింపుగా ఈ అవకాశం లభించిందన్నారు. తన హయాంలో ముస్లిం సమాజం అభివృద్దికి , అభ్యున్నతికి కృషిచేస్తానన్నారు. ముస్లిం సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా అడహక్ కమిటీ ఉంటుందని తెలిపారు. అనంతరం అడహక్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు
previous post
next post