మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతమున్న కోవిద్ నిబంధనల కారణంగా సందడంతా సోషల్ మీడియాలోనే ఉండనుంది. ప్రతి స్టార్ పుట్టినరోజుకు కామన్ డిస్ప్లే పిక్చర్, కామన్ మోషన్ పిక్చర్ వంటివి విడుదల చేయడం పరిపాటి. అయితే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుక మరింత ప్రత్యేకంగా జరగనుంది.
ఒకరి కాదు ఇద్దరు కాదు ఏకంగా 100 మందికి పైగా సెలబ్రిటీలు చిరంజీవి పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేయనున్నారు. ఈ సెలబ్రిటీలు అందరూ ఒక్కసారిగా ఈరోజు సాయంత్రం 7 గంటలకు కామన్ మోషన్ పిక్చర్ ను విడుదల చేస్తారు. ఇలా 100 మంది ఒకేసారి ఇలా విడుదల చేయడం అనేది ఎప్పుడూ జరగలేదు. కామన్ మోషన్ పిక్చర్ ను విడుదల చేయనున్న సెలబ్రిటీలు అన్ని ఇండస్ట్రీలకు చెందిన వారు ఉన్నారు. వారిలో ప్రముఖంగా మమ్ముట్టి, మోహన్ లాల్, శివకుమార్, వెంకటేష్, ఉపేంద్ర, సుదీప్, జాకీ ష్రాఫ్, పునీత్ కుమార్, సునీల్ శెట్టి, శ్రేయ, రకుల్ ప్రీత్, రాధికా, ఖుష్బూ, నివిన్ పాలీ, విశాల్, శర్వానంద్, రానా, రష్మిక వంటివారు ఉన్నారు.
ఇలా అందరూ ఒకేసారి కామన్ మోషన్ పిక్చర్ ను విడుదల చేయడం అనేది మెగా అభిమానులకు అపురూప ఘట్టం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక సినిమా విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆచార్య సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ రేపు సాయంత్రం 4 గంటలకు విడుదల కానుంది. ఇవే కాక ఇంకా మెగా అభిమానులు సోషల్ మీడియాలోనే వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మొత్తమ్మీద మెగాస్టార్ పుట్టినరోజు సందడి మాములుగా ఉండేలా లేదు.