ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి నరేంద్ర మోడీ చరిత్రలో తనదైన ముద్ర వెయ్యడం కోసం ఎంతో కష్టపడుతున్నారు. గద్దెనెక్కినప్పటి నుంచి దేశంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారు. ముఖ్యంగా దేశంలో నల్ల ధనాన్ని నిర్ములించడానికి పాత నోట్లకు మంగళం పలికి కొత్త ఆలోచనను చేశారు. ఈ నేపథ్యంలోనే గతంలో పాత రూ.500 మరియు రూ.1000 నోట్లను బ్యాన్ చేశారు. అలాగే ఇప్పుడు పాత రూ.100 నోటు ను కూడా బాన్ చేయనున్నారట.
ఈ నేపథ్యంలో ప్రజల దగ్గర ఉన్న పాత వంద రూపాయల సిరీస్ నోట్లు అన్నిటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటామని హామీ ఇచ్చింది. కాబట్టి ఇంక ఆ పాత నోట్ ల స్థానంలో కొత్త సిరీస్ నోట్లను సర్క్యూలేషన్ చేయాలని ఆలోచిస్తుందట. ఈ విషయమై మంగళూరు లోని దక్షిణ కన్నడ జిల్లా పంచాయితీ హాల్ లోని జిల్లా స్థాయి బ్యాంకింగ్ సెక్యూరిటీ కమిటీ అండ్ క్యాష్ మేనేజ్మెంట్ కమిటీ సభలో ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మహేష్ మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పాత వంద రూపాయల సిరీస్ నోట్లని ఈ సంవత్సరం మార్చి నాటికి ఆర్ బీ ఐ తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంలో ఇప్పటికే ఆరేళ్ళ నుంచి పాత రూ.100 నోట్లను ముద్రించడం ఆపేశామని మహేష్ తెలిపారు. కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా గతంలో ప్రింట్ చేసిన ఈ వంద రూపాయల నోట్లను అన్నింటిని వెనక్కి తీసుకుంటామని తెలిపారు. దేశంలో కొత్త నోట్లను మాత్రమే ఉంచాలనే ఆలోచనతో దీన్ని అమలులోకి తీసుకొస్తున్నామని ఆయన అన్నారు. అలాగే ఆర్బీఐ ఇప్పటికే రూ.10 కాయిన్స్ చెల్లదని ప్రజల్లో ముద్ర[పడిందని, వాటిని చెలామణి చెయ్యమని బ్యాంకులని సూచించింది.