తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన భేటీలో కొద్దిసేపటి క్రితమే రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించారు. కెసిఆర్ విద్యాశాఖ మంత్రితో మరియు నిపుణులతో దీర్ఘకాలం చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలోని 5,34,903 విద్యార్థులు పరీక్షలు లేకుండానే ఇంటర్ కు ప్రమోట్ కావడం విశేషం. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఇకపోతే విద్యార్థులను గ్రేడ్ల ఆధారంగా ఇంటర్మీడియట్ కు ప్రమోట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఆ గ్రేడ్లను ఎలా వేస్తారో కూడా వివరించింది. ఇప్పటికే పదవ తరగతి – ఎస్.ఎస్.సి వెబ్ సైట్ లో అప్ లోడ్ అయిన ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా విస్యార్థులకు ఆయా విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తారు. 2015 లో ప్రవేశపెట్టిన ఈ ఇంటర్నల్ అసెస్మెంట్ గ్రేడ్లు లో విద్యార్థి యొక్క కాండక్ట్ మరియు ప్రతి సబ్జెక్టు పై అతనికి ఉన్న అవగాహన ద్వారా మార్కులు నిర్ణయిస్తారు.
ఇకపోతే హైకోర్టు జిహెచ్ఎంసి పరిధి లోని విద్యార్థులను మరియు రంగారెడ్డి జిల్లాలోని విద్యార్థులను మినహాయించి మిగతా వారికి పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి చెప్పగా వారు అలా రెండుసార్లు పరీక్షలు నిర్వహించడం కుదరదని ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.