ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణ ప్రక్రియలో పట్టుదలగా ఉంది. ముఖ్యంగా జగన్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ లో గణనీయంగా టెస్టుల సంఖ్యను పెంచుతున్నారు. నాలుగు రోజుల క్రితమే టెస్టుల సంఖ్య 1 మిలియన్ దాటి రికార్డు సృష్టించిన జగన్ నాలుగు రోజులు కూడా తిరగకముందే 11 లక్షల టెస్టులు చేసి మరో రికార్డును అందుకున్నారు.
టెస్టులు చేసి, పాజిటివ్ చేసిన వారిని నిర్బంధంలో ఉంచి కరోనాను నియంత్రించే ప్రక్రియలో జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ లో 22,259 కేసులు నమోదయ్యాయి. ఇందులో రికవర్ అయినవారు 11,101 మంది ఉండగా 264 మంది కరోనా కారణంగా చనిపోయారు. జగన్ ఆదేశాల మేరకు ఏపీలో టెస్టుల సంఖ్యను మరింత పెంచనున్నారు.