మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బార్ ఖేడా ప్రాంతంలో కునో నేషనల్ పార్కు ఉంది. షెయోపూర్, మొరేనా జిల్లాల్లో 344.686 చదరపు విస్తీర్ణంలో ఈ జాతీయ ఉద్యానవనం విస్తరించి ఉంది. 748 కిలోమీటర్ల వ్యాప్తిని కలిగి ఉంది. 1981లో ఈ ఉద్యానవనం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా ఉండేది. 2018లో దీన్ని జాతీయ ఉద్యానవనంగా మార్చారు. ఈ పార్కులో ఆసియా సింహాలు, చిరుత పులులు, ఎలుగు బంట్లు, తోడేళ్లు, బంగారు నక్క, హైనా, దుప్పి, సాంబార్ జింకా, నీల్గాయ్, నాలుగు కొమ్ముల లేడి, కృష్ణ జింక, అడవి పందులు, ఆవులు ఉన్నాయి.
కునో నేషనల్ పార్కు అందాలు
కునో నేషనల్ పార్కు 748 కిలో మీటర్ల మేర విస్తరించిన ఉద్యానవన ప్రాంతం ఇది. ప్రకృతి అందాలు అలుముకుని ఉంటుంది. అంతరించిపోయే దశలో ఉండే క్రూర మృగాలు, జంతువులను ఆ పార్కులో సంరక్షిస్తుంటారు. ఇప్పటికే చాలా రకాల జంతులను కునో నేషనల్ పార్కులో సంరక్షిస్తున్నారు. ఆ జంతువులను చూడటానికి పర్యాటకులు వస్తూ ఉంటారు. దాంతో పర్యాటక ప్రాంతంగానూ అభివృద్ధి చెందుతోంది. దేశం నలుమూలల నుంచి కునో నేషనల్ పార్కుకు తరలి వస్తుంటారు.
మరో 12 చిరుతల రాక
తాజా సమాచారం ప్రకారం కునో నేషనల్ పార్కుకు కొత్తగా మరో 12 చిరుతలను తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు దక్షిణాఫ్రికా నుంచి భారత్కు చిరుతలను తీసుకొని రానున్నారు. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎనిమిది చిరుతలను ఆఫ్రికాలోని నమీబియా నుంచి తీసుకొచ్చారు. 70 ఏళ్ల క్రితం భారత్లో అంతరించిన చీతాలు మళ్లీ దేశంలో అడుగుపెట్టడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ పుట్టిన రోజే ఆ ఎనిమిది చిరుతలను కునో నేషనల్ పార్కులో వదిలారు. ఇందులో ఐదు ఆడ, మూగ చిరుత పులులు ఉన్నాయి. అదనంగా మరో 12 చిరుతలు రానుండటంతో అధికారులు వీటి కోసం ప్రత్యేక ఎన్క్లోజర్లను ఏర్పాట్లు చేస్తున్నారు.
కునో నేషనల్ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా?
రైలు ప్రయాణం: కునో నేషనల్ పార్కుకు వెళ్లాలని అనుకునే వారికి ట్రైన్ సౌలభ్యం కలదు. కునో నేషనల్ పార్కుకు దగ్గర్లో గ్వాలియర్, సవాయ్ మధోపూర్, కోట, జైపూర్, ఝాన్సీ వంటి రైల్వే స్టేషన్లు ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ నుంచి ట్రైన్ సహాయంతో మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్కుకు ఈజీగా చేరుకోవచ్చు. స్టేషన్ నుంచి పార్కుకు చేరుకోవడానికి బస్సు, ప్రైవేట్ వాహనాల సౌకర్యం కలదు.
విమాన ప్రయాణం: కునో నేషనల్ పార్కుకు వెళ్లాలని అనుకునే వారు విమాన సౌకర్యం కూడా కలదు. కునో నేషనల్ పార్కుకు దగ్గర్లోని గ్వాలియర్ ఎయిర్పోర్టు ద్వారా అక్కడికి చేరుకోవచ్చు. ఎయిర్ పోర్ట్ నుంచి ప్రైవేట్ బస్సుల, కార్లు అందుబాటులో ఉంటాయి.
బస్సు సౌకర్యం: తెలంగాణ, విజయవాడ నుంచి మధ్యప్రదేశ్ నీమచ్కు బస్సు సౌకర్యం కలదు. నీమచ్ నుంచి కునో నేషనల్ పార్కుకు 381 కిలో మీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి పార్కుకు వెళ్లడానికి ప్రైవేట్ బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి.