క్రీడాభిమానుల ఆవేశం కారణంగా ఇండోనేషియాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తూర్పు జావా ప్రావిన్సులోని ఫుట్ బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 127 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి వార్త డైలీ స్టార్ పేర్కొంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. 180 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
అరెేమా ఫుట్ బాల్ క్లబ్ – పెర్సెబయ సురబయ మధ్య గత రాత్రి జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పుట్ బాల్ మ్యాచ్ లో అరెమా పుట్ బాల్ క్లబ్ ను వారి సొంత మైదానంలో వారి బద్ద ప్రత్యర్ధి జట్టు పెర్సెబయా జట్టు ఓడించడంతో అరెమా జట్టు మద్దతుదారులు పెద్ద సంఖ్యలో మైదానంలోకి దూసుకుపోయారు. ఇరు జట్ల అభిమానులు ఘర్షణకు దిగారు. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. దీంతో ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీ చార్జి చేశారు.
ఇది తొక్కిసలాటకు దారి తీసింది. మలాంగ్ లో జరిగిన ఈ ఫుట్ బాల్ మ్యాచ్ అనంతరం అభిమానులు మైదానంలోకి చొచ్చుకుని వస్తున్న వీడియోలు, ఫోటోలు స్థానిక మీడియా ఛానళ్లు ప్రసారం చేశాయి. ఈ ఘటనపై ఇండోనేషియా ఫుట్ బాల్ అసోసియేషన్ దర్యాప్తునకు ఆదేశించింది. ఇండోనేషియాలో ఇలాంటి ఘర్షణలు ఇటీవల సర్వసాధారణంగా మారిపోయాయి.
పూణే లో చాందినీ చౌక్ పాత వంతెనను ఇలా కూల్చేశారు..వీడియో వైరల్