ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్లో బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారు. ఫిరోజాబాద్లోని నాగ్లాఖాంగార్ పోలీస్స్టేషన్ పరిధిలో ప్రైవేట్ బస్సును లారీ వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా 31 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో సుమారు 45 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. బస్సు డిల్లీ నుంచి బిహార్లోని మోతిహరికి వెళ్తుండగా ఆగ్రా -లక్నో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
previous post
next post
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?