కరోనా పాజిటివ్ కేసులు ప్రతీ చోటా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ కేసుల ప్రభావం విపరీతంగా ఉంటోంది. రోజుకి 2 వేలకు పైగా కేసులు, రోజూ 40కి పైగా మరణాలు సంభవిస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా కరోనా కలకలం అలజడి రేపుతోంది.
మొత్తంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో 140 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం గమనార్హం. ఈ 140 మందిలో 60 మంది సెక్యూరిటీ స్టాఫ్ (పోలీస్) ఉండగా, లడ్డూ తయారు చేసే వారిలో 16 మందికి, 14 మంది పూజారులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ 140 మందిలో 70 మంది కోలుకున్నారు. వారిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసారు. మరో 70 మందికి ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతోంది.