పెరుగుతున్న వాహానాలు, ఫ్యాక్టరీల నుండి వెలువడే విష వాయువుల వల్ల మనం నిత్యం పీల్చే గాలి స్వచ్ఛతను కోల్పోయి ప్రమాదకరంగా మారింది. దీని వల్ల ప్రతిఒక్కరి ఊరిపితిత్తుల పనితీరు సన్నగిల్లడమే కాకుండా పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కొందరికి ఈ వాయు కాలుష్యం వల్ల శ్వాస తీసుకోవడంలో పలు ఇబ్బందులు పడుతున్నారు. మన వంటిట్లో లభించే సుగంధ ద్రవ్యాలతో చేసిన ఒక ఔషధంతో ఈ ఇబ్బందులను అందిగమించవచ్చు. ఆ ఔషధం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మన శరీరంలోని వ్యర్థవాయువులను బయటకు తీయడంలో మన ఊపిరితిత్తులు సహాయపడతాయి. అవి దూమపానం చేయడం వల్ల, పీల్చే కలుషిత వాయువుల వల్ల దెబ్బతింటున్నాయి. ఇవి శుభ్రపరచుకోవడానికి రోజు ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచం మిరియాల పొడి కలిపి నీటిలో బాగా మరిగించి వేడి టీ లాగా తాగండి. జీలకర్ర నీటిలో డీకంజెస్టింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీనివల్ల ఛాతీలో ఏదైనా శ్లేష్మం చేరడాన్ని నియంత్రించడమే కాదు ఊపిరితిత్తులు శుభ్రం చేసేందుకు ఒక ఔషధం లాగ పనిచేస్తుంది. అంతే కాదు ఈ ద్రావణం త్రాగడం వల్ల జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది. జీలకర్ర నీరు గొప్ప హైడ్రేటర్ అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
జీలకర్ర నీరు తాగడానికి సరైన సమయం ఉదయం ప్రాణాయామం చేసిన అనంతరం దీన్నితాగడం వల్ల మంచి పనితీరును కనపరుస్తది. వీటితో పాటు అల్లం రసం, పసుపు నీటితో ఆవిరి పట్టిన ఊపిరితిత్తులలో ఉన్న వ్యర్దాలు తొలగే అవకాశం ఉంది. చేతులు వెనకకు పెట్టి ముక్కుతో గాలి పీల్చి పొడి దగ్గు దగ్గడం వల్ల కూడా ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. గ్రీన్ టీ కూడా శరీరంలోని వ్యర్థాలను తొలగించే ఉపకారిగా పని చేస్తుంది. ఆరుబయటకు వెళ్ళివచ్చినప్పుడు బెల్లం కానీ తేనే తీసుకోవడం మంచిది. ఇవి సన్నని దుమ్ము దూళి రవ్వలు ఊపిరితిత్తుల లోనికి వెళ్లకుండా అడ్డుకుంటాయి.