కరోనా మహమ్మారి ఎవరినీ వదిలిపెట్టడం లేదు. క్రమక్రమంగా ఈ వైరస్ అంతటా వ్యాపిస్తోంది. ప్రస్తుతం కేసులు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లో మరీ ప్రమాదకరంగా ఉంది. తాజా సమాచారం ప్రకారం తెలంగాణ గవర్నర్ ఆఫీస్ లో కరోనా కలకలం సంచలనం సృష్టించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే గవర్నర్ ఆఫీస్ రాజ్ భవన్ లో 15 మంది ఉద్యోగులకు కరోనా టెస్టుల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్ర గవర్నర్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు సమాచారం. అలాగే గవర్నర్ తమిళిసై స్వీయ పరీక్షలు చేయించుకోగా నెగటివ్ అని తేలిందని ఆమె స్వయంగా తెలిపారు. దీంతో రెడ్ జోన్లలో ఉన్న వారు తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని, తమను తాము రక్షించుకోవడంతో పాటు ఇతరులను రక్షించే అవకాశముంటుందని తెలిపారు.