అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన పూర్తి చేసుకున్న తరువాత మళ్ళీ పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. సీఎంగా వైఎస్ భాద్యతలు చేపట్టిన తొలినాళ్లలో ఒకటి రెండు పర్యాయాలు పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో లూప్ లైన్లో పనిచేసిన అధికారులకు చాలా మందికి ప్రాధాన్యత పోస్ట్ లు నాడు దక్కాయి. అదే విధంగా టీడీపీ హయాంలో ప్రాధాన్యత పోస్ట్ లలో పనిచేసిన పలువురు అధికారులను లూప్ లైన్ లోకి పంపారు. ఇప్పుడు తాజాగా 17 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బదిలీ అయిన అధికారులు వీరే
రైల్వే డీజీపీగా ద్వారకా తిరుమలరావు
విజయవాడ సీపీగా బీ శ్రీనివాసులు
ఏడీజీపీ ఆర్గనైజేషన్ గా ఎన్.బాలసుబ్రమణ్యం
రోడ్ సేఫ్టీ ఏడిజిపిగా కృపానంద త్రిపాఠి,
ఎస్ఈబీ డైరెక్టర్ గా పి.హెచ్.డి.రామకృష్ణ
గుంటూరు అర్బన్ ఎస్పీగా ఆర్.ఎన్.అమ్మిరెడ్డి
శ్రీకాకుళం ఎస్పీగా అమిత్ బర్దార్
డీజీపీ ఆఫీస్ అడ్మిన్ ఏఐజీగా బి.ఉదయ్ భాస్కర్
విశాఖ శాంతిభద్రతల డీసీపీగా ఐశ్వర్య రాస్తోగి
ఎస్ ఐబీ ఎస్పీగా అట్టాడా బాబూజీ
విశాఖ గ్రామీణ ఎస్పీగా బి.కృష్ణారావు
విజయవాడ రైల్వే ఎస్పీగా సి.హెచ్.విజయారావు
పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా నారాయణ నాయక్
సీఐడీ ఎస్పీగా నవదీప్ సింగ్ గ్రేవాల్
గుంటూరు గ్రామీణ ఎస్పీగా విశాల్ గున్నీలు నియమితులు అయ్యారు. ‘దిశ’ ప్రత్యేక అధికారిగా ఉన్న దీపికను డీజీపీ కార్యాలయంలో ఏపీఎస్ పీ ఆరవ బెటాలియన్ కమాండెంట్ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో
తెలిపింది. ఐపీఎస్ ఎస్ రంగారెడ్డిని డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారులు బదిలీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని వెనుక కూడా ఏమైనా స్కెచ్ ఉందంటారా?