బ్యాంకు అనగానే ముందు గుర్తుకు వచ్చేది ఎస్బిఐ (SBI). ఎన్ని బ్యాంకులు ఉన్నప్పటికీ ఎస్బిఐ కి ఉన్నంత క్రేజ్.. మరి దేనికి ఉండదు. బ్యాంకింగ్ విషయమే అలా ఉంటే. మరి ఇందులో ఉద్యోగం పొందడం కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తూ ఉంటారు. ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వం రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 ప్రొబేషనరీ ఆఫీసర్లు భర్తీ చేయటానికి నోటిఫికేషన్ విదుదలచేసింది. వివరాలు ఇలా ఉన్నాయి..!
అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత/ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా అర్హులు.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్
చివరి తేది: 04 /12 /2020
వెబ్సైట్ :https://www.sbi.co.in/web/careers
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ప్రిలిమ్స్ ఎగ్జామ్: 31 /12 /2020, జనవరి 2, 4, 5 2021
ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫలితాల విడుదల: 2021 జనవరి మూడో వారం
మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ డౌన్లోడ్: 2021 జనవరి 4వ వారం
మెయిన్ ఎగ్జామ్: 2021 జనవరి 29
మెయిన్ ఫలితాల విడుదల: 2021 ఫిబ్రవరి మూడోవారం
ఈ పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు పరీక్షలు ఉంటాయి. వీటిలో అర్హత సాధించిన వారికీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. తుది ఎంపికైన అభ్యర్థులు రూ.2 లక్షల బాండ్ రాయాల్సి ఉంటుంది. జాయిన్ అయ్యే సమయంలో రాసిన బాండ్ ప్రకారం అభ్యర్థులు కనీసం 3సంవత్సరాల పాటు బ్యాంకుకు సేవలు అందించాల్సి ఉంటుంది.