అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ఐదు కేంద్రాల్లో రీపోలింగ్ కొనసాగుతోంది.నరసరావుపేట నియోజకవర్గ పరిధిలోని కేసానుపల్లి, గుంటూరు పశ్చిమ అసెంబ్లీ పరిధిలోని నల్లచెరువు, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కలనూతల, నెల్లూరు జిల్లా కోవూరు ఇసుకపాలె, సూళ్లూరుపేట అటకానితిప్ప పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఆటకానితిప్పలో పది గంటల సమయానికే 30.47శాతం పోలిం జరుగగా మిగిలిన పోలింగ్ కేంద్రాల్లో 10నుండి 20శాతం వరకూ నమోదు అయ్యింది. ఈ పోలింగ్ కేంద్రాల పరిధిలో 5,064 మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు 1200మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ను పర్యవేక్షిస్తున్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఇవిఎంలు మోరాయిస్తే తక్షణం రిపేరు చేయడానికి బెల్ కంపెనీ ఇంజనీర్లను సిద్ధంగా ఉంచడంతో పాటు స్టాండ్బై ఇవిఎంలు, వివి ప్యాట్లను ఉంచారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?