Aryan khan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ (sharukh) తనయుడు డ్రగ్స్ కేసులో పట్టుబడి NCB విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తన కొడుకును బయటకు తీసుకొచ్చేందుకు షారుక్ నానా తంటాలు పడుతున్నట్టు తెలిసింది. బెయిల్ పిటిషన్ ప్రతీసారి కొట్టివేతకు గురవుతుండటంతో షారుక్ తీవ్రఅసహనానికి గురవుతున్నట్టు టాక్. తాజాగా ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. ఆర్యన్ ఖాన్ను విడుదల చేయాలంటే NCB అధికారులు రూ.25 కోట్లు(25crores) డిమాండ్ చేశారని క్రూయిజ్ షిప్లో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇదంతా ఉట్టికట్టు కథ అని తనకు ఇరికించేందుకు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి వివరణ ఇచ్చారు.
టాలీవుడ్లోకి బాలీవుడ్ స్టార్ తనయుడు
అసలు ఎవరీ ప్రత్యక్ష సాక్షి..
ఆర్యన్ మాదక ద్రవ్యాలు తీసుకున్నాడని తొలుత చెప్పిన ప్రత్యక్ష సాక్షి పేరు ప్రభాకర్ సాయిల్. ఇతను కేపీ గోసావికి బాడీగార్డు.. కేవీ గోసావి ప్రైవేటు డిటెక్టివ్గా పనిచేస్తున్నాడు. పార్టీ జరిగిన క్రూయిజ్ షిప్లో వీరిద్దరూ ఉన్నారు.. దీంతో NCB అధికారులు వీరిని ప్రత్యక్ష సాక్ష్యల లిస్టులో ఉంచింది. అయితే, తాజాగా NCB ఎదుట విచారణకు అటెండైన ప్రభాకర్ సాయిల్ ఈ షాకింగ్ నిజాలను వెల్లడించారు. షారుక్ కొడుకును NCB ఆఫీసుకు తీసుకొచ్చాక శామ్ డిసౌజా అనే పర్సన్తో గోసావి ఫోన్లో మాట్లాడాడని.. ఆర్యన్ ఖాన్ (Aryan Khan) విడుదల కోసం రూ.25 కోట్లు డిమాండ్ చేయాలని చెబుతుంటే తాను విన్నట్టు వాంగ్మూలం ఇచ్చాడు. చివరకు ఈ డీల్ రూ.18 కోట్లకు ఫైనల్ చేసి అందులో రూ.8 కోట్లు ఆర్యన్ను క్రూయిజ్లో అదుపులోకి తీసుకున్న అధికారి వాంఖడేకు ఇవ్వాలని గోసావి డిసౌజాతో అన్నట్టు కూడా వెల్లడించాడు.
Nara Lokesh: మళ్ళీ రిస్క్ చేస్తానన్న లోకేష్! 2024 టీడీపీ యువ పరువుకి పరీక్ష!?
ముంబై కమిషనర్కు వాంఖడే లేఖ..
ప్రభాకర్ సాయిల్ చేసిన ఆరోపణలతో NCB అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రజలు ఈ విషయాన్ని నిజం అనుకుంటే సంస్థ పరువుపోతుందని భావించి ప్రభాకర్ చేసిన ఆరోపణలు నిజం కాదన్నారు. కేసు కోర్టు (court) పరిధిలో ఉన్నందున ప్రభాకర్ తన స్టేట్మెంట్ను కోర్టులో చెప్పాలి గానీ సోషల్ మీడియాలో ఎలా పోస్టు చేస్తారంటూ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే NCB జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తనను కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని.. ముంబయి పోలీసు కమిషనర్కు ఓ లేఖ రాశారు. తనకు రక్షణ కల్పించాలని అందులో కోరారు. కొందరు బడా వ్యక్తులు తనను జైలుకు పంపాలని చూస్తున్నారని, ఉద్యోగం నుంచి తొలగించేలా చేస్తున్నారని లేఖలో కోరారు. తాజాగా ఈ కేసు విషయంలో శివసేన స్పోక్స్ పర్సన్ సంజయ్ రౌత్ స్పందించారు. ఈ విషయంలో ముంబై పోలీసులు విచారణ జరపారన్నారు. కాగా ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.