కొన్ని కొన్ని సార్లు గతం కళ్లముందు కదలాడితే కళ్లు చెమ్మగిల్లుతాయి కొందరికి. అనుకోని ప్రమాదకర ఘటనలు ఎదురైనప్పుడు ఇక నేనంటూ ఈ భూమీద ఉండనేమోనని చాలా మంది ఆ క్షణాన అనుకునే వాళ్లు చాలా మందే ఉంటారు. కాగా ఆ గండం నుంచి బయపడిన తర్వాత వారి ఆనందానికి అవదులుండవేమో.. ఈ సంగతి పక్కన పెడితే అలాంటి ఒక ప్రమాదకర ఘటన జరిగి ఏండ్లు గడిచినా కాని చాలా మంది దాన్ని ఒక పీడ కలలాగ గుర్తుపెట్టుకుంటూనే ఉంటారు.
ఆ ఘటన జరిగిన రోజు వచ్చిందంటే చాలా ఆ అలా జరిగుంటే నేను ఇప్పుడు మీ ముందు ఉండే వారిమి కాదేమోనని ఎమోషనల్ అవుతుంటారు. అలాంటి ప్రమాదకర ఘటనే ఈ రోజు చాలా మంది గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతున్నారు. ఎవరనుకుంటున్నారా? అదేనండి మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన 247 మంది. అసలేంజరిగిందంటే 25 ఏండ్ల కిందట జరిగిన ఓ ఘటన అందరినీ భయబ్రాంతులకు గురిచేసింది.
సరిగ్గా 1993 నవంబర్ 15న మద్రాస్ నుంచి హైదరాబాద్ మీదుగా దేశ రాజధాని ఢిల్లీ చేరుకునేందుకు బయలు దేరిన ఓ విమానం అనుకోకుండా ప్రమాదంలో చిక్కుకుంది. ఈ విమానంలో ప్రయాణించిన వారెవరంటే టాలీవుడ్ ప్రముఖులైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాల కృష్ణ, విజయశాంతి, బ్రహ్మానందం తో సహా మొత్తం సినీ తారలతో కలిపి 247 మంది ఆ ఫైట్ లో బయలు దేరారు. కాని ఆ ఫ్లైట్ హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టులో పొగమంచు ఎక్కువగా ఉన్న కారణంగా అది ల్యాండింగ్ కు అనుకూలించలేదు.
కాగా అనుకోని పరిస్థితి ఎదురుకావడంతో ఆ విమానం మళ్లీ మాద్రాస వైపు వెళ్లింది. ఆ సమయంలోనే నెల్లూరు జిల్లా ఆవరణంలోకి వచ్చిన తర్వాత ఆ విమానానికి సాంకేతిక సమస్యలు వచ్చాయి దాంతో విమానాన్ని అక్కడే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నట్టు పైలెట్లు ప్రకటించారు. ఆ క్షణంలో విమానంలో ఉన్న వారి పరిస్థితి మాటల్లో చెప్పలేనంతగా మారింది. ఆ సమయంలోనే పైలట్లు ఆ విమానాన్ని పంట పొలాల్లో ల్యాండ్ చేశారు. దాన్ని ల్యాండ్ అనే కంటే క్రాష్ అంటేనే బాగుంటుందేమో.. కాని ఆ రోజు ఏదైన ప్రమాదం జరిగుంటే మాత్రం మనకు వీళ్లు దక్కేవారు కాదని గతాన్ని గుర్తు చేసుకున్నారు ప్రముఖులు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!