Maa Election’s: రేపు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు “మా” అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి “మా” ఎన్నికల పోటీ చాలా రసవత్తరంగా ఉంది. ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. ప్రకాష్ రాజ్ వర్సెస్ విష్ణుల మధ్య పోటాపోటీ వాతావరణం నువ్వానేనా అన్నట్టుగా ఉంది. మంచు విష్ణుకి ఇండస్ట్రీలో పెద్దలతో పాటు నటుడు బాలకృష్ణ ఇంకా చాలా మంది ప్రముఖులు సపోర్ట్ చేస్తూ ఉన్నారు.
మోహన్ బాబు స్వయంగా…
మోహన్ బాబు స్వయంగా ఆడియో రూపంలో అదేవిధంగా… సోషల్ మీడియా వేదికగా… విష్ణు కి సపోర్ట్ చేయాలని కోరుతూ ఉన్నారు. ఈరోజుతో ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో చాలామంది వీడియో రూపంలో మా ఎన్నికల గురించి స్పందిస్తున్నారు. తాజాగా నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి..”మా” ఎలక్షన్స్ గురించి స్పందించారు. జరగబోయే ఎన్నికలలో మా అసోసియేషన్ సభ్యులు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
మంచు విష్ణు కి పృథ్వీరాజ్ సపోర్ట్…
అదే రీతిలో మా ఇంటికి వచ్చి తినండి గాని, మా ఇంటిలో ప్రయత్నం చేయవద్దు అంటూ ప్రకాష్ రాజ్ ప్యానల్ ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ కనకాల ఇచ్చిన ఈ స్లోగన్ తో… తాను కూడా ఏకీభవిస్తున్నాను అని మంచు విష్ణు నీ.. సపోర్ట్ చేయాలని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. మంచు విష్ణు మ్యానిఫెస్టో చాలా అద్భుతంగా ఉందని, కచ్చితంగా విష్ణు ఘన విజయం సాధించడం గ్యారెంటీ అని.. ఎన్ని ప్రలోభాలు.. మాటలు..వాగ్దానాలు ఇచ్చిన వేరే వాళ్ళు వైపు లోంగా వద్దు అని.. మంచు విష్ణు మనవాడు గెలిపించాలి అని.. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ పిలుపునిచ్చారు.