టాలీవుడ్ లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగుతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ పృథ్వీరాజ్. ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలలో కమెడియన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ తన నటనతో ఎంతగానో అలరిస్తూ ఉంటారు. అటువంటి పృథ్వీరాజ్ ఒక పక్క సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూనే మరోపక్క రాజకీయాలలో వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది గతంలో.
సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు వైసిపి పార్టీ తలపెట్టిన ప్రతి కార్యక్రమంలో పాల్గొన్న పృథ్వీరాజ్..జగన్ చేసిన పాదయాత్రలో కూడా పాల్గొని కార్యకర్తల్లో జోష్ నింపారు. దీంతో అధికారంలోకి వైసిపి రావడంతో టీటీడీ చైర్మన్ పదవిని పృథ్వీరాజ్ కి వైసీపీ హైకమాండ్ అప్పజెప్పక కొన్ని వివాదాల్లో ఇరుక్కుని .. పార్టీకి చెడ్డపేరు రాకుండా రాజీనామా చేయడం జరిగింది.
గత ఏడాది జనవరిలో ఈ ఘటన జరగడం తో చాలా వరకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు పృథ్వీరాజ్. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ లో ఇంటర్వ్యూకి వచ్చిన పృథ్విరాజ్ తాజా రాజకీయాల గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ వివాదంలో తనపై ట్రోలింగ్ వచ్చిన ఘటనపై పృథ్వీరాజ్ స్పందిస్తూ.. మహామహులు రాజకీయాల్లో విఫలమై అనేక అవమానాలు ఎదుర్కొన్నారు అని పేర్కొన్నారు. అలాంటి వారిపై జరుగుతుండగా ఆఫ్ట్రాల్ పృథ్వీరాజ్ ఎంత అంటూ తనని తాను తక్కువ చేసుకొని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సినిమాల పరంగా గానీ ఆస్తిపరంగా పవన్ కళ్యాణ్ చాలా గొప్పవాడు, రాజకీయాలు వేరు సినిమాలు వేరు అని తెలిపారు.