జనసేన పార్టీ మరోసారి ప్రజల పక్షాన నిలబడుతోంది. ఇప్పటికే ఎన్నోసార్లు ప్రజా సమస్యలపై పోరాడిన జనసన నాయకులు, ప్రజలకు అండగా మరోసారి తమ సేవా గుణాన్ని చాటుకోనున్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈసారి సేవా కార్యక్రమాలు మరింత భారీ స్థాయిలో జరగనున్నాయి.
ఈసారి కరోనా కారణంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరగబోవట్లేదు. అందుకనే జనసేన నాయకులు ఈసారి రికార్డు స్థాయిలో ఏకంగా 300కుపైగా ఆక్సిజన్ సిలిండర్లు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా పంచాల్సిన ఆక్సిజన్ సిలిండర్ల లిస్ట్ వచ్చేసింది. ఒక్కొక్క ఆక్సిజన్ సిలిండర్ ఖరీదు దాదాపు 10,000 రూపాయలు ఉంటుందని అంచనా. అంతే కాకుండా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో 6 నార్మల్ వెంటిలేటర్ కిట్లను ఆసుపత్రి యాజమాన్యానికి అందజేశారు స్థానిక జనసేన నాయకులు.