బ్రమాడినో, జనవరి 27: బ్రెజిల్లో ఆనకట్ట కూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 34కు చేరింది. మినాస్ గెరాసిస్ రాష్ట్రంలోని బెలోహోరిజొంటే నగరం సమీపంలో పరవోపెబా నదిపై ఉన్న ఈ ఆనకట్ట శుక్రవారం కొట్టుకుపోయింది. అక్కడ సమీపంలోని ఇనుప ఖనిజం గనిని నిర్వహిస్తున్న వలే అనే కంపెనీ ఆధ్వర్యంలో ఈ ఆనకట్ట ఉంది.
ఆనకట్ట కుప్పకూలడంతో సమీప ప్రాంతాలను బురద ముంచెత్తింది. ఈ బురద వరద ప్రవాహానికి దగ్గరలో ఉన్న ఒక వంతెన కుప్పకూలింది. ఆరు హెలికాఫ్టర్లతో సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు.
బాధితులను హెలికాఫ్టర్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ఘటనలో 300మందికి పైగా గల్లంతు అయ్యారు. గల్లంతు అయిన వారిలో ఆ కంపెనీ ఉద్యోగులు కూడా ఉన్నారు. 34మంది మృతి చెందినట్లు అధికారులు దృవీకరించారు. 170మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన 23మందిని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితమే ఈ ఆనకట్టను జర్మనీకి చెందిన టుయెవ్ స్యూడ్ కంపెనీ తనిఖీ చేసి ఎలాంటి లోపాలు లేవని దృవీకరణ పత్రం ఇచ్చింది.
ఆనకట్ట కూలిపోవడంతో వలే కంపెనీకి బ్రెజిల్ పర్యావరణ శాఖ 462కోట్ల రూపాయల భారీ జరిమానా విధించింది.
బ్రెజిలియన్ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనరో ఘటనపై తీవ్ర దిగ్భంతిని వ్యక్తం చేశారు. ఇది బ్రెజిల్ చరిత్రలో అతిపెద్ద వైపరీత్యమని పేర్కొన్నారు. బాధితులందరినీ కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?