మన జీవితం ఎప్పుడు ఎటు ప్రయాణిస్తుందో ఎవరూ ఊహించలేరు. అదృష్టం తలుపు తడితే రాత్రికి రాత్రి ఎంతో మంది కోటీశ్వరులు అవుతుంటారు. కొంతమంది జీవితంలో అదృష్టం దానంతట అదే తలుపు తడుతూ వస్తుంది. అలాంటి అదృష్టం ప్రస్తుతం కేరళకు చెందిన 28 ఏళ్ల కుర్రాడిని వరించడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. లాటరీ టికెట్ కొనడం వల్ల అందులో గెలిచి 39 కోట్ల రూపాయలను గెలుచుకున్నాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కేరళలోని కోజికోడ్కు చెందిన అబ్దుస్సలామ్ అనే వ్యక్తి మస్కట్ ప్రాంతంలో ఒక షాపును నిర్వహిస్తున్నాడు. ఈ యువకుడు ఈ ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో 20 మిలియన్ల దిర్హమ్లు(సుమారు రూ. 39 కోట్లు) లాటరీలో గెలుచుకున్నాడు. అయితే తను 39 కోట్ల రూపాయలు గెలుచుకున్న విషయం ఒక రోజు ఆలస్యంగా అతనికి తెలిసింది.రఫల్ నిర్వాహకులు అబ్దుస్సలామ్ను కలుసుకునేందుకు అతని గ్రూపు సభ్యులను కలిశారు. దీంతో తన లాటరీ గెలుచుకున్న విషయం తన స్నేహితులు ద్వారా అబ్దుస్సలామ్ తెలుసుకున్నాడు.
ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు గెలుచుకోవడంతో అబ్దుస్సలామ్ మాట్లాడుతూ లాటరీలో గెలుచుకున్న ఈ మొత్తం డబ్బులను తన స్నేహితులతో కలిసి పంచుకుంటానని తెలియజేశారు. కాగా గత ఏడాది మే నెలలో యూఏఈలో ఓ భారతీయుడు ఇదేవిధంగా లాటరీ గెలిచి ఏకంగా 10 మిలియన్ల దిర్హమ్లు అంటే రూ. 20 కోట్ల రూపాయలను గెలుచుకున్నాడు. అయితే ఆ వ్యక్తి కూడా కేరళకు చెందిన వ్యక్తి కావడం గమనార్హం.అతని పేరు దిలీప్ కుమార్. అతను ఏప్రిల్ 14న ఆన్లైన్ లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశాడు. దిలీప్ ఈ డ్రాను రఫెల్ ద్వారానే గెలుచుకున్నాడు. ప్రస్తుతం అబ్దుస్సలామ్ కూడా ఆన్లైన్ లాటరీ టికెట్ కొని రఫెల్ ద్వారానే 39 కోట్ల రూపాయలు గెలుచుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసిన సదరు నెటిజన్లు లక్ష్మీ పుత్రుడని కామెంట్లు పెడుతున్నారు.